ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల్లో ఇప్పుడు విద్యుత్ బిల్లులు పెరగడంపై సర్వత్రా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ప్రజల సందేహాలను నివృత్తి చేయడానికి గానూ వి విద్యుత్ శాఖ సిద్దమైంది. సందేహాల నివృత్తి కోసం గుంటూరు విద్యుత్ భవన్లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసారు విద్యుత్ శాఖ అధికారులు.
దీనిపై మాట్లాడిన గుంటూరు సర్కిల్ ఎస్ఈ బి.విజయకుమార్... వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులకు సంబందించి సందేహాలపై హెల్ప్డెస్క్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు 0863-2268857, 0863-2236500కు ఫోన్ చేయాలని ఆయన ప్రజలకు సూచించారు. టోల్ఫ్రీ 1912ను సంప్రదించి తగిన వివరాలు తెలుసుకోవచ్చు అని ఆయన సూచించారు.