తమిళనాడు లోని విపక్ష పార్టీ ఇప్పుడు కొత్త ఆందోళనలో ఉంది. ఏడాది కాలంగా ముగ్గురు ఎమ్మెల్యేలను ఆ పార్టీ కోల్పోయింది. ముగ్గురు ఎమ్మెల్యేలు కేపీపీ స్వామి, కార్తవ రాయన్‌, జె.అన్బళగన్‌ లు మరణించారు. కార్తవరాయన్‌, కేపీపీ స్వామి మృతితో డీఎంకే బలం 98గా ఉండగా... 

 

అన్బళగన్‌ మృతితో శాసన సభలో ఆ పార్టీ బలం 97కు పడిపోయింది. తాజాగా ఒక ఎమ్మెల్యే కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనితో ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఆ పార్టీ బలంగా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం పార్టీ కార్యకర్తలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అధినేత స్టాలిన్ కూడా విషాదంలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: