మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడికి గానూ లాక్ డౌన్ ని మళ్ళీ విధించే అవకాశాలు ఉన్నాయి అనే చర్చలు కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ తో పాటుగా మహారాష్ట్ర తమిళనాడు అలాగే తెలుగు రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల పై ఇప్పుడు కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తుంది. 

 

అందుకే ఇప్పుడు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పై చర్చ జరుగుతుంది. అయితే దేశ వ్యాప్తంగా కాకుండా ఇప్పుడు ఎక్కువగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ లో మాత్రమే లాక్ డౌన్ ని పెంచే ఆలోచన కేంద్రం చేస్తుంది అని అంటున్నారు. అక్కడ పెంచడమే కాదు సంపూర్ణ లాక్ డౌన్ తో రాష్ట్రాలను షట్ డౌన్ చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: