కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. సోషల్ డిస్టెన్స్ కోసం గానూ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో కేబినేట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. కురుపాం ఇంజనీరింగ్ మూడు నర్సింగ్ కాలేజీలకు ఆమోదం తెలపనుంది రాష్ట్ర ప్రభుత్వం. 

 

ఇప్పటికే మంత్రులు అధికారులు సచివాలయం వద్దకు చేరుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మీద కూడా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక చిరు వ్యాపారాలకు ఆర్ధిక సహాయం మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. 40 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది కేబినేట్. లాక్ డౌన్ పై కూడా ఈ కేబినేట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: