ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసారు. విదేశాలలో ప్రవాసాంధ్రులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అని వాళ్ళను తీసుకుని రావడానికి గానూ ఎక్కువ విమానాలను నడపాలి అని ఆయన కేంద్రాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు. ఇక ఏపీ కేబినేట్ సమావేశం సందర్భంగా ఆయన ఈ లేఖ కేంద్రానికి రాసారు. 

 

కేంద్ర ప్రభుత్వం వెంటనే విదేశాల్లో ఉన్న ఆంధ్రులను తీసుకుని రావడానికి గానూ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కాగా ఏపీ కేబినేట్ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో మొత్తం 40 అంశాల గురించి రాష్ట్ర కేబినేట్ చర్చిస్తుంది. సోషల్ డిస్టెన్స్ కోసం గానూ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో కేబినేట్ సమావేశం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: