ప్రధాని నరేంద్ర మోడీ ఏడాది పాలనలో తీసుకున్న నిర్ణయాలను ఇంటింటికీ వెళ్ళి వివరిస్తామని బిజెపి ఎంపీ బండి సంజయ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆత్మనిర్భర్ భారత్ కార్యాక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్రం ఇస్తున్న నిధులను సీఎం కేసీఆర్ దారి మళ్లిస్తున్నారని ఆయన ఆరోపణలు చేసారు. 

 

గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు సీఎం కేసీఆర్ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఈ సందర్భంగా మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపణలు చేసారు. కరోనా టెస్టులను చేయటంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు. కరోనాతో చనిపోయిన వ్యక్తి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయకపోవటం బాధాకరమని ఆయన ఆరోపించారు. డాక్టర్లు, పోలీసులు, మీడియా ప్రతినిధులకు రక్షణ కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: