ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 182 కరోనా కేసులు నమోదయ్యయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే అదే సమయంలో జగన్ సర్కార్ కరోనా వైరస్ పరీక్షల విషయంలో కొత్త రికార్డులు అందుకుంటోంది. 
 
రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షల సంఖ్య 5,00,000 దాటింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 5 లక్షల 10 వేల 318 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఈ స్థాయిలో మరే రాష్ట్రంలో కరోనా పరీక్షలు జరగలేదు. రాష్ట్రంలో మిలియన్ జనాభాకు 9,557 మందికి కరోనా పరీక్షలు చేసి అరుదైన రికార్డును జగన్ సర్కార్ సొంతం చేసుకుంది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య 54.67 శాతానికి పెరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: