నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో పదుల సంఖ్యలో కాల్ మనీ కేసులు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో కాల్ మనీ అరాచకం ఒకటి వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం చక్రాయపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వడ్డీ వ్యాపారి దంపతులు సామ్రాజ్యం అనే మహిళను దారుణంగా హత్య చేశారు. వీరయ్య, నర్సమ్మ దంపతులు రోడ్డుపై వెళుతున్న సామ్రాజ్యం కళ్లలో కారం కొట్టి గడ్డపారతో పొడిచి హత్య చేశారు. 
 
వీరయ్య సామ్రాజ్యం 20 రూపాయల వడ్డీతో గతంలో అప్పు ఇచ్చారు. అప్పు తీర్చకపోవడంతో మృతురాలి ఇళ్లు, పొలాన్ని బలవంతంగా తమ పేర్లపై రాయించుకున్నారు. ఆస్తులన్నీ తమ పేర్లపై రాయించుకున్న తరువాత కూడా అప్పు చెల్లించాలని సామ్రాజ్యంను వేధించిన వడ్డీ వ్యాపారి దంపతులు తాజాగా మహిళపై దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: