సిద్ధిపేట జిల్లాలో కరోనా కేసులు నానాటికి పెరుగుతూ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. తాజాగా జిల్లాలోని మిరుదొడ్డి మండల పరిధిలోని జంగంపల్లి గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న అఖిల్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. అఖిల్ గత కొద్దిరోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు.

 

ఇరవై రోజుల క్రితం తీవ్ర భాదతో హైదరాబాద్ లోని ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్ లో చేరాడు. ప్రస్తుతం ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఉన్నట్టుండి శ్వాస సంబంధిత ఇబ్బంది తలెత్తగా వైద్య అధికారులు అఖిల్ కు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షలలో కరోనా  వైరస్ సోకిందని మిరుదొడ్డి, భూంపల్లి హాస్పిటల్ వైద్యాధికారి మల్లికార్జున్ వెల్లడించారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: