నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి త‌రుచూ కాల్పుల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్పుడుతున్న పాకిస్తాన్‌కు భారత్ భారీ షాక్ ఇచ్చింది. పాక్ ఆర్మీ పోస్టుల‌ను భార‌త ఆర్మీ ధ్వంసం చేసిందని అధికార‌వ‌ర్గాలు చెబుతున్నాయి. పాక్ రేంజ‌ర్లు జ‌రిపిన కాల్పుల్లో ఒక భార‌త జ‌వాన్ మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీనికి ప్ర‌తీకారంగా భార‌త ఆర్మీ స‌మ‌ర్థ‌వంతంగా పాక్ ఆర్మీ పోస్ట్‌ల‌ను దెబ్బ‌తీసింది.

 

నిజానికి.. జ‌మ్ముక‌శ్మీర్‌లోని నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి ఉన్న సాధార‌ణ పౌరుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని పాక్ బ‌ల‌గాలు కాల్పుల‌కు తెగ‌బ‌డుతూ ఉద్రిక్త‌ప‌రిస్థితుల‌ను సృష్టిస్తోంది. ఈ నేప‌థ్యంలో భార‌త బ‌ల‌గాలు పాక్ ఆర్మీకి గ‌ట్టిగా బుద్ధి చెప్పింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: