తెలంగాణాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి అక్కడ చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం ఆగడం లేదు అనే చెప్పాలి. ఇక ఈ తరుణంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా కలెక్టర్ ని క్వారంటైన్ లోకి వెళ్ళాలి అని ఆదేశాలు వచ్చాయి. సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్తున్నట్లు కలెక్టర్‌ కార్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 

 

కొండపోచమ్మసాగర్‌ ముంపు గ్రామాలైన పాములపర్తి, ఇతర ముంపు గ్రామస్థులు సొంతంగా గౌరారంలో కొనుగోలు చేసిన ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి పంచాయతీ ద్వారా హెచ్‌ఎండీఏ అనుమతి పొందే విషయమై ఇటీవల జడ్పీటీసీలు కలెక్టరేట్‌లో కలెక్టర్ ని కలవగా.... వారితో వచ్చిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన కూడా క్వారంటైన్ కి వెళ్ళారు.

మరింత సమాచారం తెలుసుకోండి: