టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ సిఎం జగన్ కుట్ర అని మాజీ సిఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తాను ఫోన్ చేస్తున్నా సరే అచ్చెన్నాయుడు స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. వంద మంది పోలీసులు ఏ ముందస్తు నోటీసు లేకుండా అచెన్నను అదుపులోకి తీసుకున్నారు అని చంద్రబాబు  మీడియాకు విడుదల చేసిన లేఖలో ఆరోపించారు. దీనికి హోం మంత్రి బాధ్యత వహించి అరెస్ట్ చెయ్యాలి అని డిమాండ్ చేసారు. 

 

సిఎం వైఎస్ జగన్ అచ్చెన్న కిడ్నాప్ కి బాధ్యత వహించాలి అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు మరో నాలుగు రోజుల ముందు జరిగిన ఈ కిడ్నాప్ సిఎం జగన్ కుట్ర అని ఆయన ఆరోపించారు. ఎక్కడికి తీసుకుని వెళ్ళారో ఎందుకు తీసుకుని వెళ్ళారో తెలియదు అని అన్నారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: