ఈఎస్ఐ స్కాం విషయంలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో మరో ముగ్గురిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

 

ఈఎస్ఐ స్కామ్‌లో ఈఎస్ఐ తిరుపతి హాస్పిటల్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రమేష్‌కుమార్‌ను ఏసీబీ బృందం అర్థరాత్రి అదుపులోకి తీసుకుందని అధికారులు మీడియాకు వివరించారు. రమేష్ కుమార్ ని విజయవాడకు తరలించామని అధికారులు పేర్కొన్నారు. మందుల కొనుగోళ్లలో రవికుమార్‌ పాత్ర ఉన్నట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.  ఇక మరి కొంత మందిని కూడా ఇందులో అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అని సమాచారం. ముగ్గురిని నేడు ఏసీబీ కోర్ట్ లో ప్రవేశ పెడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: