మహారాష్ట్రలో కరోనా చుక్కలు చూపిస్తుంది. కరోనా దెబ్బకు ముంబై నుంచి నాసిక్ వరకు కూడా ఇప్పుడు ప్రజలు భయపడుతున్నారు. ఎవరూ కూడా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇక కరోనా రాజకీయ నాయకులను కూడా వేధిస్తుంది. ఎన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నా సరే రాజకీయ నాయకులకు కూడా కరోనా సోకుతుంది. 

 

ఇప్పటికే ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్‌ రాగా తాజాగా మరో మంత్రికి కరోనా సోకిందని అధికారులు పేర్కొన్నారు. మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి ధనుంజయ్‌ ముండే, ఆయన వ్యక్తిగత సహాయకుడితో పాటు కొంతమంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా వెల్లడించింది. మహారాష్ట్రలో కరోనా ఇప్పటి వరకు 97 వేల మందికి సోకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: