మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ పై టీడీపీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్.. వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు నిదర్శనం అన్నారు టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా. ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. టీడీపీ ఆవిర్బావం నుంచి ఎర్రన్నాయుడు కుటుంబం క్రియాశీలకంగా పనిచేస్తోందన్న ఆయన... రాష్ట్రంలో బీసీ కులాలకు మార్గదర్శకులుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 

 

ఎర్రన్నాయుడు కుటుంబాన్ని రాజకీయంగా మట్టుబెట్టాలని వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఈ సందర్భంగా ఆయన ఆరోపణలు చేసారు. ఈనెల 16వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తాడనే భయంతోనే ఆయనను అరెస్ట్ చేశారని రాజా వ్యాఖ్యానించారు. బీసీ నాయకుడిని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: