టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిందని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సిఎం జగన్‌ని అరెస్ట్ చేసినప్పుడు సంబరాలు చేసుకున్నవారు ఇప్పుడెలా మాట్లాడతారని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పినట్లుగా అచ్చెన్నాయుడిని లాక్కుని వెళ్లలేదన్న ఆమె మామూలుగానే తీసుకెళ్లారని వివరించారు. 

 

మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేశారని సుచరిత వ్యాఖ్యానించారు. వైద్య పరికరాల కొనుగోళ్లలనూ అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవద్దా? అని ఆమె నిలదీశారు. అది కేంద్ర ప్రభుత్వ డబ్బయినా, రాష్ట్ర ప్రభుత్వం డబ్బయినా చర్యలు తీసుకోవాలి కదా? అని ఆమె టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: