రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజా ధనం వృధా కాకుండా ఆదా చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లం వ్యాఖ్యానించారు. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన... రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటి వరకు తాము 2072.29 కోట్లను ఆదా చేసామని అన్నారు. ఇరిగేషన్ లో 1139 కోట్లను ఆదా చేసామని చెప్పుకొచ్చారు. 

 

నిర్దేశిత సమయంలో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా తాము పంచాయితీ రాజ్ లో 196.99 కోట్లు ఆదా చేసామని అన్నారు ఆయన. ఎక్కడా కూడా ప్రజా ధనం వృధా కానీయడం లేదని చెప్పుకొచ్చారు అజయ్ కలం. సంక్షేమ కార్యక్రమాల విషయంలో ముందు చూపుతో వ్యవహరిస్తున్నామని అజయ్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: