టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే, బీసీ నేత ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు.తప్పు చేస్తే బీసీలను వదిలేయాలి అని చెప్పలేం కదా అని ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. స్కాం ల నుంచి తప్పించుకోవడానికే టీడీపీ బీసి కార్డ్ ని వాడుతుందని అన్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలోనే చంద్రబాబుకి బీసులు గుర్తుకు వచ్చారా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు బీసీలను ఎప్పుడు కూడా ఓటు బ్యాంకు గానే చూసారు అని మండిపడ్డారు. 

 

బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిన నాయకుడు సిఎం జగన్ అని అన్నారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించిన గొప్ప నేత సిఎం జగన్ అన్నారు. అరెస్ట్ కు బీసీలకు ఏ సంబంధం లేదని ఆయన స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: