గత ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు చంద్రబాబు చేసింది ఏమీ లేదు అని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. గత ప్రభుత్వం హయాంలో ప్రతీ పని లో అవినీతి చేసారని వ్యాఖ్యానించారు. పేదలకు పెట్టే అన్నంలో కూడా అన్యాయం జరిగిందని  మండిపడ్డారు. సిఎం జగన్ బీసీల పక్షపాతి అని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు కేబినేట్ లో 6౦ శాతం రిజర్వేషన్ ని కల్పించారు అని ఆయన గుర్తు చేసారు. 

 

ఈఎస్ఐ స్కాం లో 150 కోట్ల వరకు అవినీతి జరిగిందని ఆయన అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన గొప్ప నేత సిఎం జగన్ అన్నారు ఆయన. ఈ స్కాం లో చంద్రబాబు నాయుడు లోకేష్ పాత్ర కూడా ఉందని జోగి వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: