భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఐపిఎల్ పై దృష్టి పెట్టింది. ఎలా అయినా సరే ఐపిఎల్ ని నిర్వహించడానికి గానూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సిద్దమైంది. భారత్ తో పాటుగా దుబాయ్ శ్రీలంక లో మ్యాచులను నిర్వహించడానికి గానూ ప్లాన్ చేస్తుంది. దీనిపై ఏ క్షణం లో అయినా సరే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. 

 

దీనిపై ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్షుడు గంగూలి ఇతర బోర్డ్ సభ్యులతో కూడా సమావేశమయ్యారు. ఎలా అయినా సరే మ్యాచులను నిర్వహించాలి అని పట్టుదలగా ఉన్న ఆయన దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. భారత్ లోని విశాఖ చెన్నై లేదా కటక్ లో నిర్వహించే అవకాశం ఉంది అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: