ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారం ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు పోలీసులు. ఆయనకు ఇటీవలే ఆపరేషన్ జరిగింది. ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడికి విజయవాడ అనిశా కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించగా అనారోగ్యం దృష్ట్యా ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందించాలని జడ్జి ఆదేశాలు ఇచ్చారు.
తొలుత అనిశా అధికారులు విజయవాడ సబ్ జైలుకు ఆయన్ను తరలించగా అక్కడి నుంచి ఆయనను గుంటూరు తీసుకుని వెళ్తున్నారు. ఇక ఆయన వైద్యం కి సంబంధించిన నివేదికను కోర్ట్ కి సమర్పించాలి అని కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది.