ఈ సృష్టింలో ఎవరు నమ్మినా.. నమ్మకున్నా.. విధిని ఎదిరించి పోరాడటం అనేది జరగదు.  ముఖ్యంగా చావు విషయంలో జరగాల్సి ఉంటే సమయం వస్తే ఏదీ ఆగదని మన పెద్దలు అంటూ ఉంటారు.  ఓ వ్యక్తి చావు నుంచి తప్పించుకోవాలని చూశాడు.. కానీ విధి వైపరిత్యం చావు నుంచి తప్పించుకోలేకపోయాడు... నల్లగొండ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఉదాహరణగా నిలిచింది.   వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లాలో చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ ఆపి టైర్లు చూసుకుంటున్న డ్రైవర్‌ను అదుపుతప్పిన మరో లారీ ఢీకొట్టింది.

 

దీంతో టైర్లు చెక్‌ చేసుకుంటున్న డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.  అది చూసి భయపడిపోయిన డ్రైవర్ తనకు శిక్ష తప్పదని.. ఎవరైనా వస్తే పట్టి పోలీసులకు అప్పజెప్పుతారని భయపడి లారీ దూకి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో అటు వైపుగా వేగంగా ఓ కారు వస్తుంది.. భయంతో ఉన్న లారీ డ్రైవర్ దాన్ని గమనించలేదు. వేగంగా వచ్చిన కారు అతడిని ఢీకొట్టింది. కారు ఢీకొన్న ఘటనలో ప్రమాదం చేసిన లారీ డ్రైవర్‌ సైతం మృతిచెందాడు. ఇరువురి మృతితో స్థానికంగా విషాదం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: