ఆంధ్రప్రదేశ్ లో నిరసనలు తెలియజేయడం బుద్ధిలేని వ్యవహారం అని టీడీపీ సీనియర్ నేత జేసి దివాకర్ రెడ్డి అన్నారు. నిరసనలను సిఎం జగన్ పట్టించుకోడు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజ్యాంగం లేదు రూల్స్ లేవు అన్నారు. ఆఫీసర్లు అందరికి నడుం లు విరిగిపోయాయి అని ఆరోపణలు చేసారు. 

 

సంపన్నుడు నాలుగేళ్ళు అధికార౦లో ఉంటాడు అని ఈ నాలుగేళ్ళు కూడా ఎం జరుగుతుందో ఎవరికి తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నాలుగేళ్ళు అందరూ సైలెంట్ గా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఏదైనా ఉంటే తేల్చుకోవచ్చు అన్నారు. మనం ఎవరిని ఏమీ అనాల్సిన అవసరం లేదన్న ఆయన పెద్ద మనిషికి యేసు క్రీస్తు లేడు, శివయ్య లేడు, ఏడు కొండలవాడు లేడు, అల్లా అంతకంటే లేడు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. ఈ అరెస్ట్ నాకు ఆశ్చర్యంగా లేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: