విజయవాడ గ్యాంగ్ వార్ కి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్యాంగ్ వార్ లో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పండుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి జైలుకి తరలించారు. దీనిపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు పండు అరెస్ట్ కి సంబంధించి తమకు ఏ సమాచారం ఇవ్వలేదు అని వారు ఆరోపిస్తున్నారు. 

 

గ్యాంగ్ వార్ లో పండు కీలక నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ గొడవలో తోట సందీప్ ని అతను చంపడంతో అతనిపై ఇప్పటికే కేసులు నమోదు చేసారు పోలీసులు. ఇక అతని పై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసు కి సంబంధించి 25 మందిని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: