టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ నేపధ్యంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి అమరావతి వస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇప్పుడు అచ్చేన్నకు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన్ను పరామర్శించడానికి గానూ విజయవాడ జైలు సూపరిండెంట్ ని అనుమతి అడిగారు చంద్రబాబు. 

 

ఇక ఇదిలా ఉంటే అచ్చెన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే ఆయనకు బ్లీడింగ్ అవుతుంది అని ఆయన కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మార్గం లోనే చంద్రబాబు హైదరాబాద్ నుంచి వస్తున్నట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం ఆయనను పరామర్శిస్తారు. ఇప్పటికే కుటుంబ సభ్యులతో కూడా చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: