ఈఎస్ఐ స్కాం లో మొత్తం 19 మంది నిందితులు ఉన్నారు అని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఈఎస్ఐ స్కాం లో ఇప్పటి వరకు ఏడుగురిని తాము అరెస్ట్ చేసామని అధికారులు వివరించారు. అందరిని జడ్జి ముందు ప్రవేశ పెట్టామని అన్నారు. సోమవారం కస్టడీ పిటీషన్ వేస్తామని ఈ స్కాం లో  మరికొందరిని ప్రశ్నించాల్సి ఉందని అన్నారు. 

 

మరి కొందరిపై కేసులు కూడా నమోదు చెయ్యాల్సి ఉందని పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే నిందితులు అందరికి కూడా 15 రోజులు  రిమాండ్ విధించారు న్యాయమూర్తి. చాలా మందిని ప్రశ్నిస్తామని మరికొన్ని అరెస్ట్ లు కూడా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. హైకోర్ట్ లో హౌస్ మోషన్ పిటీషన్ వేసినట్లు తెలిసింది అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: