తన అరెస్ట్ పై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. ఆయనతో పాటుగా అరెస్ట్ అయిన రమేష్ కుమార్ కూడా హౌస్ మోషన్ పిటీషన్ ని దాఖలు చేసారు. దీనిపై నేడు కోర్ట్ విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆయన ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

 

ఆయనకు ఏసీబీ కోర్ట్ 15 రోజుల పాటు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయనను చూడటానికి గానూ కుటుంబ సభ్యులతో పాటుగా హైదరాబాద్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వస్తున్నారు. ఆయనతో పాటుగా ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: