ఈఎస్ఐ స్కాం లో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే మరొకరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. 

 

మొత్తం అరెస్ట్ చేసిన వారి సంఖ్య ఇప్పుడు ఏడుకి చేరుకుంది. మొత్తం అందరిని కూడా ఏసీబీ జడ్జి ఎదుట ప్రవేశ పెట్టారు అధికారులు. నేడు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కొంత మందిని ప్రశ్నించాలి అని మొత్తం 19 మంది నిందితులు ఉన్నారు అని ఎసీబీ అధికారులు చెప్తున్నారు. కాగా తన అరెస్ట్ పై అచ్చెన్న హైకోర్ట్ కి వెళ్ళారు.

మరింత సమాచారం తెలుసుకోండి: