మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడి హెల్త్ బులెటిన్‌ ని అధికారులు విడుదల చేసారు. ఆయన సుదీర్ఘ ప్రయాణం చేయడంతో గత ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ సుధాకర్ మీడియాకు వివరించారు. ఆ గాయానికి తాము చికిత్స అందిస్తున్నామన్న ఆయన... అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గాయం తగ్గడానికి రెండుమూడు రోజులు పట్టొచ్చని చెప్పారు. 

 

ఆయనకు బీపీకి ప్రస్తుతం వాడుతున్న మందులనే కొనసాగిస్తున్నామన్నారు. షుగర్ నార్మల్ గానే ఉందని చెప్పారు. కాగా ఆయనను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈఎస్ఐ స్కాం లో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు ఏసీబీ కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: