దేశ వ్యాప్తంగా మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ విధించే అవకాశాలు కనపడుతున్నాయి.  కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఆ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ అడుగులు వేస్తున్నారు. కేసులు పెరుగుతున్న రాష్ట్రాలలో ఇప్పుడు లాక్ డౌన్ మినహా మరో మార్గం అనేది కనపడటం లేదు అనే చెప్పాలి. 

 

ఇక ఈ నెల 16,17 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ సిఎం లతో మాట్లాడే అవకాశం ఉంది. వారి అందరితో మాట్లాడి ఆయన అభిప్రాయలను తీసుకుని లాక్ డౌన్ పై ముందుకు అడుగు వేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అనేది ఇప్పుడు అత్యవసరంగా మారింది అని అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: