టీడీపీ మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలకు భారీ షాక్ తగిలింది. వీరిద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తన కుటుంబ వివాదంలో జోక్యం చేసుకుని తనను బెదిరించారనే ఆరోపణలతో మంజుప్రియ అనే మహిళ తూర్పుగోదావరి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో వీరిపై కేసు నమోదైంది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులతో పాటు ఏడుగురిపై తుని నియోజకవర్గం తొండంగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 
 
ఇందులో ఏ5 గా యనమల రామకృష్ణుడిని, ఏ6గా నిమ్మకాయల చినరాజప్పను పేర్కొన్నారు. ఒకవైపు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈ.ఎస్.ఐ కుంభకోణంలో రిమాండ్ కు వెళ్లగా.... ఈ కేసులో మాజీ మంత్రుల పాత్ర ఉందని తేలితే మాత్రం వీరికి మరిన్ని సమస్యలు లేవని చెప్పవచ్చు. మంజుప్రియ అనే దళిత యువతి తన భర్తకు రెండో పెళ్లి చేయించటానికి ప్రయత్నించారనే ఆరోపణలతో ఫిర్యాదు చేయగా మాజీ మంత్రులపై కేసు నమోదైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: