ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంది. కనీసం అక్కడ ఈ మహమ్మారి వైరస్ ను కంట్రోల్ చేసే ప్రయత్నాలు కూడా జరగడం లేదు. ఎంతో మంది ప్రముఖులు సైతం ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్నారు. ఇక తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు అయిన షాహిద్ అఫ్రిది కరోనా వైరస్ బారిన పడ్డట్లు తెలుస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో  నిలుస్తూ ఉంటాడు షాహిద్ ఆఫ్రిది . ఎప్పుడు భారత్ పై అక్కసును వెళ్లగక్కుతూ  సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు షాహిద్ ఆఫ్రిది. 

 

 గతంలో షాహిద్ ఆఫ్రిది ఇమ్రాన్ ఖాన్ స్థానంలో తో సరికొత్తగా పాకిస్తాన్ ప్రధాని కాబోతున్నాడు అనే వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే పాకిస్తాన్లో విజృంభిస్తున్న మహమ్మారి కరోనా  వైరస్ ఏకంగా సెలబ్రిటీలను  సైతం వదలడం లేదు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు అయిన షాహిద్ అఫ్రిది కరోనా  వైరస్ బారిన పడడం సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: