ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది కియారా అద్వాని, బాలీవుడ్ లోనే కాకుండా వివిధ భాషల్లో కూడా నటించి తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం కియారా అద్వానీ అక్షయ్ కుమార్ సరసన లక్ష్మీబాంబ్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాంచన మూవీ హిందీ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ హారర్ మూవీ లో అక్షయ్ కుమార్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. 

 


 అయితే సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం కియారా అద్వానీ అక్షయ్ కుమార్ తో కలిసి నటించింది. అయితే తాజాగా ఒక నెటిజన్ లక్ష్మీ బాంబ్ సినిమా గురించి ఎంతగానో వెయిట్ చేస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ ఒక పోస్ట్ పెట్టినా దీనిపై స్పందించిన కియారా అద్వానీ నేను కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను  అంటూ చెప్పుకొచ్చింది. గత ఆరు సంవత్సరాల నుంచి అక్షయ్ కుమార్ సార్ తో మీ ప్రయాణం ఎంతో గొప్పగా ఉంది అంటూ భూషణ్ కిలాడి అనే ఒక నెటిజన్ తెలుపుతూ లక్ష్మీ బాబు సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ ఒక పోస్ట్ పెట్టగా నేను కూడా అంటూ.. కియారా అద్వానీ ఒక రీప్లే  చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: