అన్ని ఆధారాలతోనే టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అని స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ అరెస్ట్ వ్యవహారంపై స్పందించారు. అచ్చెన్న అరెస్ట్ పై స్పీకర్ గా తనకు సమాచారం ఇచ్చారు అని ఆయన పేర్కొన్నారు. 

 

మందుల కొనుగోలు విషయంలో ఈఎస్ఐ స్కాం జరిగిందని, ఆ అవకతవకలను ఏసీబీ గుర్తించింది అని స్పీకర్ వ్యాఖ్యానించారు. అందుకే ఆయనను అదుపులోకి తీసుకున్నారు అని స్పీకర్ అన్నారు. ప్రతీ ఆధారం ఏసీబీ వద్ద ఉంది అని ఆయన అన్నారు. వంద కోట్ల రూపాయలను దారి మళ్ళించారు అని అన్నారు. అక్రమ సంపాదనను మనీ లాండరింగ్ ద్వారా తలించారు అని స్పీకర్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: