తెలంగాణాలో ఇప్పుడు ప్రజలు అడవి జంతువుల దెబ్బకు భయపడుతున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అని అంటున్నారు. అదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో ప్రజలు ఇప్పుడు గ్రామాలను ఖాళీ చేస్తున్నారు. అక్కడ గత పది రోజుల్లో పులి హడావుడి ఎక్కువగా ఉంది అని సమాచారం.
ఇక మంచిర్యాల జిల్లాలో కూడా పులి హడావుడి మొదలయింది. అదే విధంగా హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో ఉన్న ఒక అటవీ క్షేత్రంలో కూడా పులి ప్రజలను బాగా భయపెడుతుంది. నెల రోజుల నుంచి అది తప్పించుకుని తిరుగుతుంది. ఇక సంగారెడ్డి జిల్లాలో కూడా పులి ఒకటి స్థానికులను భయపెడుతుంది. ఇలా ఎక్కడ చూసినా సరే అటవీ జంతువులు ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి.