దేశంలో రోజు రోజుకి కరోనా వైరస్ పెరుగుతుంది. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సీనియర్ మంత్రులు మరియు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో అన్ని రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రధాన మంత్రి మోడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

  

ఆసుపత్రి పడకలు / ఐసోలేషన్ పడకల సంఖ్యను నగరం మరియు జిల్లా వారీగా పెంచాలని అధికారులు మోడీకి వివరించారు. రాష్టాలకు అవసరమైన సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలి అని  అత్యవసర ప్రణాళికను చేపట్టాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులకు సూచించారు.  కాగా దేశంలో కరోనా వైరస్ సంఖ్య 3 లక్షలు దాటింది. మరణాలు కూడా పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: