చట్టానికి ఎవరూ అతీతులు కాదని బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. అవినీతి చేయకపోతే టీడీపీ నేతలకు భయం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఎవరిని అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించవద్దని అన్నారు. టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అన్నారు. 

 

రాజధానిలో ఇన్  సైడర్ ట్రేడింగ్ జరిగింది అని కన్నా ఆరోపించారు. టీడీపీ హయంలోనే పోలవరం లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ఆయన ఆరోపణలు చేసారు. అచ్చెన్నాయుడు, ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ ని సమర్ధిస్తున్నామని ఆయన అన్నారు. కాగా ఏసీబీ ఈఎస్ఐ కుంభకోణం కి సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: