తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 16న ప్రగతి భవన్ లో మోదీతో జరిగే వీడియో కాన్ఫరెన్స్, తదితర అంశాల గురించి కలెక్టర్లతో చర్చించనున్నారు. 16న ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. అదనపు కలెక్టర్లు(స్థానిక సంస్థలు), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి, జిల్లా పరిషత్‌ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి తదితరులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధాని మోదీ ఈ నెల 16, 17 తేదీలలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 
 
17వ తేదీన సీఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనన్నారు. సీఎం కలెక్టర్లతో చర్చించి స్థానికంగా ఉన్న పరిస్థితుల గురించి వివరాలు తెలుసుకోనున్నారు. లాక్ డౌన్ తర్వాత పరిణామాలు, వివిధ రంగాల స్థితిగతుల గురించి చర్చించనున్నారు. నియంత్రిత సాగు విధానం గురించి... వానాకాలం సాగు ఏర్పాట్లతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకం, హరితహారం అమలు గురించి సీఎం సమీక్షించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: