దేశ వ్యాప్తంగా నైరుతి రుతు పవనాలు వేగంగా కదులుతున్నాయి. దేశంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి అని వాతావరణ శాఖ చెప్తుంది. ఉత్తరాది రాష్ట్రాలు దక్షినాది రాష్ట్రాలు కూడా ఇప్పుడు తడిచి ముద్ద అవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

 

ఇక ఏపీలో కూడా వర్షాలు బాగానే పడుతున్నాయి. ఇదిలా ఉంటే రాగల 48 గంటల్లో తెలంగాణాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కూడా ఏర్పడింది. మూడు రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్ష సూచన చేసింది. కర్ణాటక, గోవా తెలంగాణాలో రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: