దేశ వ్యాప్తంగా కోరనా కేసులు అత్యధికంగా పెరుగుతున్న రాష్ట్రం ఢిల్లీ. అక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దేశంలో దాదాపు 20 శాతం కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదు అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఇక ఆ రాష్ట్రంలో కోరనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. 

 

ఇక ఇదిలా ఉంటే వచ్చే వారంలో దేశ రాజధానిలో 20,000 కొత్త కరోనా పడకలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది . 4000 పడకలు ఉన్న హోటళ్ళు, 11000 పడకలు కలిగి ఉన్న బాంకెట్ హాల్స్ మరియు 5000 పడకలు కలిగి ఉన్న నర్సింగ్ హోమ్స్ ని సిద్దం చెయ్యాలి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఢిల్లీ సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి: