ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో సంచలనంగా మారాయి. నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసారు.

 

ఇక ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో ఇప్పటి వరకు నలుగురు విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కడప జిల్లా రాజంపేట లో ఒక విద్యార్ధి ఆత్మహత్య చేసుకుంది. ఆమె పేరు పావని. ఇక చిత్తూరు జిల్లాలో కూడా మరో విద్యార్ధి ఆత్మహత్య చేసుకోగా ప్రకాశం జిల్లాలో కూడా ఇంటర్ విద్యార్ధి ఫెయిల్ అయి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగులప్పాడులో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లాలో ఒక విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: