తెలంగాణాలో ఇప్పుడు అడవి జంతువులు ప్రజలను తీవ్రంగా భయపెడుతున్నాయి. ప్రతీ రోజు కూడా ఏదోక చోట పులి హడావుడి ఉంటుంది. ముఖ్యంగా చిరుత పులులు ఇప్పుడు ఎక్కడో ఒక చోట ప్రజలను తీవ్రంగా భయపెడుతున్నాయి. తాజాగా జనగాం జిల్లాలో చిరుత పులి ఒకటి హడావుడి చేసింది. 

 

జనగాం జిల్లా రఘునాధ పల్లి మండలం అశ్వాపురం లో చిరుత పులి  హల్చల్ చేసింది. దీనితో స్థానికులు పోలీసులకు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆ పులి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఇవి అన్ని కూడా మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ పులి కోసం అధికారులు రంగంలోకి దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: