తెలంగాణాలో పులులు ఇప్పుడు భయపెడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే తాజాగా మరో పులి మంచిర్యాల జిల్లాలో భయపెట్టింది. విధులకు వెళ్తున్న సింగరేణి ఉద్యోగులకు పులి  గుండెల్లో రైళ్ళు పరిగెత్తించింది. జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు ఆవరణలో పెద్ద పులి కనపడింది.

 

పవర్ ప్లాంట్ రైల్వే ట్రాక్ వెంట వెళ్తున్న పెద్ద పులిని గూడ్స్ రైల్వే గార్డ్ చూసి అధికారులకు సమాచారం ఇచ్చాడు. సింగరేణి పవర్ ప్లాంటు అధికారులు ఈ సమాచారం అటవీ శాఖ అధికారులకు ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. గ్రౌండ్ లెవల్‌లో పనులను నిలిపివేసి  కార్మికులను అప్రమత్తం చేశారు. ఇది మహారాష్ట్ర నుంచి వచ్చింది అని సింగరేణి అధికారులు అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: