తెలంగాణాలో ఇప్పుడు కరోనా కేసులు పెరగడం ఏమో గాని... ప్రజా ప్రతినిధులు మాత్రం తీవ్రంగా భయపడుతున్నారు. కరోనా కేసుల దెబ్బకు అక్కడి ప్రజా ప్రతినిధుల వెన్నులో వణుకు మొదలయింది. మంత్రి హరీష్ రావు ఇప్పటికే సెల్ఫ్ క్వారంటైన్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, అదే విధంగా కాంగ్రెస్ నేతలు, 

 

తెరాస ఎమ్మెల్యేలు కొందరు ఇప్పుడు ఇళ్ళ నుంచి బయటకు రావడం లేదు. తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా కలవరపరుస్తోంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చింది. హరీష్ రావు పిఎకి కూడా కరోనా సోకింది. బిజెపి నేతలకు కూడా కరోనా భయం మొదలయింది ఇప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: