హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ట్రావెల్స్‌ అక్రమాల పుట్ట అని తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ క్లియరెన్స్ సర్టిఫికెట్ల కోసం పోలీసు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారని... నకిలీ ఇన్ వాయిస్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను స్క్రాప్ వాహనాల రిజిస్ట్రేషన్ కోసం తయారు చేశారని అన్నారు. 
 
అక్రమాలు చేస్తే అరెస్ట్ చేయకూడదా? అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అండతోనే జేసీ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ది క్షమించే గుణమని.... రాజకీయ కక్ష సాధింపులు ఆయనకు తెలియవని పేర్కొన్నారు. తప్పు చేసే వారు ఎంతటి వారైనా ప్రభుత్వం క్షమించదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: