కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. గత కొన్ని రోజుల నుంచి వరుసగా విమర్శలు చేస్తున్న ఆమె మరోసారి యోగి సర్కార్ ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. అవినీతిని ఏ మాత్రం ఉపేక్షించమని పదే పదే చెబుతున్న యోగి ప్రభుత్వం పెద్ద చేపల విషయంలో మాత్రం ఉదాసీనంగా ఉంటోందని ఆమె ఆరోపించారు. 

 

విద్యాశాఖలో చాలా అవినీతి బాగోతాలు జరుగుతున్నాయన్నారు ఆమె. ఆ అక్రమాల గురించి విద్యాశాఖా మంత్రికి తెలుసా? అని ప్రశ్నించారు. సీఎం కార్యాలయానికి వీటి గురించి సమాచారం ఉందా? అని నిలదీశారు. అవినీతిని ఏమాత్రం ఉపేక్షించమని మాట్లాడుతున్న వారే పెద్ద చేపల విషయంలో ఉదాసీనంగా ఉంటున్నారని ఆరోపణల వర్షం కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: