అచ్చెన్నాయుడు విషయంలో తెలుగుదేశం పార్టీ... ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీ కార్డు వాడుతున్నారు అని మంత్రి మోపిదేవి వెంకటరమణ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తప్పుడు చేసిన తర్వాత కులం గురించి మాట్లాడుతున్నారు అని చట్టానికి ఎవరు అయినా సరే ఒకటే అని ఆయన స్పష్టం చేసారు. తప్పు చేసింది లోకేష్ అయినా చంద్రబాబు అయినా సరే శిక్ష తప్పదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. 

 

బీసీలకు న్యాయం చేసింది వైసీపీ మాత్రమే అని టీడీపీ అన్ని విధాలుగా వారిని నిలువునా ముంచింది అని ఆయన ఆరోపణలు చేసారు. ఇప్పుడు తప్పు చేసి బీసీలను అవమానిస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. కాగా అచ్చెన్న గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: