బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై ఇప్పుడు యావత్ దేశం కూడా షాక్ అయింది. అతి చిన్న వయసు లో అతను ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై ఇప్పుడు సినీ రాజకీయ ప్రముఖులు అతనికి నివాళులు అర్పిస్తున్నారు. అతని కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నారు.
తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా దీనిపై స్పందించారు. ఓ యువ నటుడిని దేశం కోల్పోయిందని .. సుశాంత్ ఆత్మహత్య తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ఆయన కుటుంబానికి తాను ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నా అని లోకేష్ ట్వీట్ చేసారు. కాగా సుశాంత్ మరణంపై ప్రధాని మోడీ కూడా దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.
Shocked to hear the young and talented sushant singh rajput commit suicide. My heartfelt condolences to his family.#SushantSinghRajput
— lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) June 14, 2020