ఆంధ్రప్రదేశ్  తెలంగాణా రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇక ప్రజా ప్రతినిధులను  కరోనా వెంటాడుతుంది. తెలంగాణాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గన్ మన్ కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. 

 

ఇక అతనితో పాటుగా మరో ముగ్గురు గన్ మన్ లకు కరోనా సోకిందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వివరించారు. తన దగ్గర పని చేసే మొత్తం ఏడుగురికి కరోనా సోకింది అని ఆయన పేర్కొన్నారు. తన గన్ మాన్ సురేష్ కరోనాతో మృతి చెందాడు అని కరోనా విషయాన్ని భయంతో దాచి పెట్టాడు అని ఆయన వ్యాఖ్యానించారు. తనకు రిపోర్ట్ నెగటివ్ గా వచ్చిందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: