కరోనా ఏమో గాని ఇప్పుడు ప్రజాప్రతినిధులు దాని పేరు వింటే చాలు భయంతో బ్రతికే పరిస్థితి వచ్చింది. దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకులు ఒకరి తర్వాత ఒకరు దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా బారిన పడుతున్నారు. అగ్ర నేతలు లేదు చిన్న నేతలు లేదు ఎమ్మెల్యే లు లేదు అందరికి కరోనా తన ప్రభావాన్ని చూపిస్తుంది. 

 

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఏపీలో అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గన్ మాన్ కి కరోనా సోకింది. దీనితో గన్ మాన్ సురేష్ మరణించాడు. ఇక ఎమ్మెల్యే దగ్గర ఉండే మరో ముగ్గురు గన్ మాన్ లకు కరోనా సోకింది దీనిపై స్పందించిన కేతిరెడ్డి తనకు కరోనా పరిక్షలు చేసారు అని తనకు నెగటివ్ వచ్చింది అని తన దగ్గర పని చేసే ఏడుగురికి కరోనా సోకింది అని అన్నారు. ఇక ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో పాటు అధికారులు అందరూ హోం క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు

మరింత సమాచారం తెలుసుకోండి: